జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన ఉచిత అంబులెన్సు సర్వీసులను పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ప్రాణాపాయ సమయంలో, మనిషి ప్రాణాన్ని నిలబెట్టడానికి అంబులెన్సుల సేవలు ఎంతో విలువైనవని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడు ఉచిత అంబులెన్స్ సర్వీసులను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. దాదాపు రూ.30 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ మూడు అంబులెన్సులలో అత్యాధునిక వెంటిలేటర్లు, అధునాతన లైఫ్ సపోర్టు యంత్రాలతో పాటు 40 రకాల వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి.
ఈ మూడు అంబులెన్సులు రాజానగరం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా సేవలు అందించనున్నట్టు తెలిపారు. అత్యవసర సేవలు అవసరమైన బాధితులు ఫోన్ చేసిన వెంటనే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని, దీనికోసం ప్రత్యేక ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ మూడు అంబులెన్సుల కోసం ఆరుగురు డ్రైవర్లు, తొమ్మిది మంది వైద్య సిబ్బంది పని చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తంగెళ్ళ ఉదయ్ కూడా పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE