ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై త్వరలోనే నిర్ణయం వెల్లడించనున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. పదో తరగతి పరీక్షల షెడ్యూల్, ఇతర అంశాలపై కసరత్తు జరుగుతుందని చెప్పారు. ఏప్రిల్ లేదా మే లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందన్నారు. అలాగే కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యాసంవత్సరం కుదించడంతో ఈసారి పదో తరగతిలో 11 పేపర్లుతో పరీక్షలు నిర్వహించాలా లేదా 6 పేపర్లతో పరీక్షలు నిర్వహించాలా అనే అంశంపైనా కూడా చర్చిస్తున్నామని, త్వరలోనే అన్ని అంశాలపై ప్రకటన చేస్తామని తెలిపారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో 2020-21 సంవత్సరానికి గానూ పదో తరగతి పరీక్షలను మే 17వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ