ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 25,197 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 164 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా కృష్ణాలో 32, విశాఖపట్నంలో 24, గుంటూరులో 22, చిత్తూరులో 19, పశ్చిమగోదావరిలో 18 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,71,070 కు చేరుకుంది.
ఇక కరోనా వలన కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14426 కి పెరిగింది. గత 24 గంటల్లో 196 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 20,54,252 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,392 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ