ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చుట్టూ తిరుగుతున్నాయి. వివేకా హత్యకు కారణం మీరే అంటే మీరే అని అధికార, ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ దీనిపై ఏకంగా ఒక పుస్తకాన్నే విడుదల చేసింది. అందులో వైఎస్సార్సీపీ లోని కీలక నేతలపై పలు సంచలన ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో అధికార పక్షం టీడీపీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టింది. ఈ క్రమంలో తాజాగా మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ఈ వ్యవహారంపై స్పందించారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. టీడీపీ విడుదల చేసిన పుస్తకంలో అన్నీ విషపు రాతలేనని, వాటిలో నమ్మదగ్గ నిజం ఒక్కటి కూడా లేదని మండిపడ్డారు. అసలు ఆ పుస్తకంపై కనీసం టీడీపీ పేరు కూడా వేసుకోలేదని, అందులో ఉన్నవన్నీ అసత్యాలు కాబట్టి పేరు వేసుకునే సాహసం ఆ పార్టీ చేయలేదని పేర్కొన్నారు. నాడు వివేకా హత్య జరిగిన సమయంలో అధికారంలో ఉంది టీడీపీ ప్రభుత్వమేనని, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దీనిపై అప్పుడే ఎందుకు సరిగా విచారణ చేయించలేదని నాని అడిగారు. వివేకా భార్య, కుమార్తె, అల్లుడు.. ఇలా ఏ ఒక్క కుటుంబ సభ్యులనూ ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. ఇక గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూడా మరణించారని, మరి ఆయన మరణంపై ఎందుకు పుస్తకం వేయలేదని మండిపడ్డారు. చంద్రబాబు ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపును అడ్డుకోలేరని పేర్ని నాని స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE