ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు (ఫిబ్రవరి 12, ఆదివారం) రాజస్థాన్ లో మరియు ఎల్లుండి (ఫిబ్రవరి 13, సోమవారం) కర్ణాటకలో పర్యటించనున్నారు. ఈ పర్యటనల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీ రాజస్థాన్ లోని దౌసా చేరుకుని రూ.18,100 కోట్ల కంటే ఎక్కువ విలువైన జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఢిల్లీ ముంబయి ఎక్స్ప్రెస్వేలోని ఢిల్లీ–దౌసా– లాల్సోట్ సెక్షన్ను ప్రధాని దేశానికి అంకితం చేయనున్నారు. ఈ సెక్షన్ ఢిల్లీ నుండి జైపూర్కి ప్రయాణ సమయాన్ని 5 గంటల నుండి 3.5 గంటలకు తగ్గిస్తుంది. 246 కి.మీ ఢిల్లీ–దౌసా– లాల్సోట్ సెక్షన్ను రూ.12,150 కోట్ల కంటే ఎక్కువ వ్యయంతో అభివృద్ధి చేశారు.
ఇక ఫిబ్రవరి 13, సోమవారం ఉదయం 9:30 గంటలకు బెంగళూరులోని యెలహంక ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ఏరో ఇండియా-2023/14వ ఎడిషన్ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’ ప్రధాని దృష్టికి అనుగుణంగా ఏరో ఇండియా-2023 స్వదేశీ పరికరాలు/సాంకేతికతలను ప్రదర్శించడం మరియు విదేశీ కంపెనీలతో భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై దృష్టి సారించనుంది. ఏరో ఇండియా-2023లో 80కి పైగా దేశాలు పాల్గొంటాయి. దాదాపు 30 దేశాల మంత్రులు మరియు గ్లోబల్ మరియు ఇండియన్ల ఓఈఎంల 65 మంది సీఈవోలు పాల్గొనే అవకాశం ఉంది. అలాగే ఏరో ఇండియా 2023 ఎగ్జిబిషన్లో దాదాపు 100 విదేశీ మరియు 700 భారతీయ కంపెనీలతో సహా 800 కంటే ఎక్కువ డిఫెన్స్ కంపెనీలు పాల్గొననున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE