జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖనుంచి కదిలేది లేదన్న పవన్ కళ్యాణ్ నేడు హఠాత్తుగా ఎందుకు విశాఖ వదిలి వెళ్లారని? ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ నిజమైన రాజకీయ నాయకుడి మాదిరిగా వ్యవహరించడం లేదని, విలువలు, నిబద్దత లేవని జనసేనానిపై మండిపడ్డారు. పవన్కు తన కార్యకర్తల కన్నా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు కాపాడటమే ముఖ్యమని పేర్ని నాని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కార్యక్రమాన్ని ఆపలేదని, ఆ పార్టీ కార్యకర్తలే రెచ్చిపోయి మంత్రులపై, వైసీపీ నేతలపై దాడులకు పాల్పడ్డారని మాజీ మంత్రి విమర్శించారు. పవన్ ఎప్పుడు ఎవరికీ మద్దతుగా మాట్లాడతారో ఆ పార్టీ కార్యకర్తలకే తెలియదని, అలాగే ఆయన తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఎదుటివారికి నీతులు చెప్పడం మానుకోవాలని జసేనానికి పేర్ని నాని సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY