ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు అమరావతి రైతుల మహా పాదయాత్రపై ఆయన మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు పేర్ని నాని శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు మహా పాదయాత్ర పేరుతొ చేస్తోంది యాత్ర కాదని, కేవలం ప్రదర్శన అని పేర్కొన్నారు. ఇక ఈ యాత్రలో పాల్గొంటున్నవారు నిజమైన రైతులు కాదని, వారంతా చంద్రబాబు నాయుడు బినామీలని ఆరోపించారు. అమరావతి పాదయాత్రకు ప్రజాదరణ లేదని, డబ్బులిచ్చి నిర్వహిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరుని మార్చడంపై చంద్రబాబు మాట్లాడుతున్నారని, నాడు ఎన్టీఆర్ని చివరి దశలో మానసిక క్షోభకు గురిచేసింది ఆయనేనని నాని వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లలు చదువుకోవడం కోసం వైఎస్సార్ ఎంతో కృషి చేశారని, స్వతహాగా ఆయన డాక్టర్ అని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు కన్నా వైసీపీనే ఎన్టీఆర్ను ఎక్కువగా గౌరవించిందని, ఆయన పేరుతో ఏకంగా ఒక జిల్లాను ఏర్పాటు చేయడమే దీనికి పెద్ద ఉదాహరణని పేర్ని నాని వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY