తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శనివారం శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్నారు. భర్త అనిల్తో కలిసి శ్రీశైలం వచ్చిన కవిత ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మల్లికార్జున స్వామి వారికి రుద్రాభిషేకం, భ్రమరాంబ అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. దీనికి ముందు ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్సీ కవిత దంపతులకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. పూజల అనంతరం స్వామివారి తీర్ధప్రసాదాలు అందజేసి స్వామివారి చిత్రపటాన్ని కూడా బహూకరించారు. ఎమ్మెల్సీ దమ్పతులకు వేదపండితులు ఆశీర్వచనం పలికారు.
ఇక స్వామివారి దర్శనానంతరం ఎమ్మెల్సీ కవిత ఆలయం వెలుపల మాట్లాడుతూ.. నా భర్త అనిల్తో కలిసి ఈరోజు శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని, మల్లికార్జున స్వామి, భ్రమరాంభ అమ్మవారిని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదని అన్నారు. స్వామి వారి అనుగ్రహంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలందరూ బాగుండాలని ప్రార్థించానని, అలాగే తిరుమల అభివృద్ధి చెందినట్లు శ్రీశైలం కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఇక ఎమ్మెల్సీ దంపతులతోపాటు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా శ్రీశైలం స్వామివారిని దర్శించుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY