ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 8846 పాజిటివ్ కేసులు, 69 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 15, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,83,925 కు చేరగా, కరోనా వలన మరణించిన వారి సంఖ్య 5041 కి పెరిగింది. మరో 9628 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. కాగా గడిచిన 24 గంటల్లో 70,511 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించారు.
కరోనా వలన ప్రకాశంలో పది మంది, చిత్తూరులో తొమ్మిది మంది, అనంతపూర్ లో ఆరుగురు, తూర్పుగోదావరిలో ఆరుగురు, కృష్ణాలో ఆరుగురు, కడపలో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, గుంటూరులో నలుగురు, నెల్లూరులో నలుగురు, విజయనగరంలో నలుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, కర్నూల్ లో ముగ్గురు, మరియు శ్రీకాకుళంలో ముగ్గురు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 5041 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (సెప్టెంబర్ 15, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షలు: 47,31,866
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 5,83,925
- కొత్తగా నమోదైనా కేసులు : 8846
- నమోదైన మరణాలు : 69
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 4,86,531
- యాక్టీవ్ కేసులు : 92353
- మొత్తం మరణాల సంఖ్య : 5041
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu