ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త పాలకమండలిని ఏర్పాటు చేసింది. టీటీడీ పాలకమండలిలో చైర్మన్ తో కలిపి మొత్తం 25 మందికి చోటు కల్పించారు. పాలకమండలి సభ్యుల నియామకంపై బుధవారం రాత్రి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఒక్కో ఎమ్మెల్యేకు టీటీడీ కొత్త పాలకమండలిలో చోటు కల్పించారు. ఇక ఎక్స్అఫిషియో సభ్యులగా టీటీడీ ఈవో, తుడా చైర్మన్, దేవాదాయ కమిషనర్, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఉండనున్నారు. ఈ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్ ను నియమించారు.
అలాగే టీటీడీకి మరో 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రోటోకాల్ విషయంలో ప్రత్యేక ఆహ్వానితులకు కూడా పాలక మండలి సభ్యులకు వర్తించే ప్రొటోకాల్ వర్తిస్తుందన్నారు. బోర్డు సమావేశాలతో సంబంధం ఉండదని పేర్కొన్నారు. టీటీడీ పాలక మండలి సభ్యుల పదవీ కాలం ఎప్పటివరకు ఉంటుందో, అప్పటివరకే ఆలయ ప్రత్యేక ఆహ్వానితుల పదవీ కాలం కూడా ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
టీటీడీ పాలక మండలి సభ్యుల జాబితా :
- పొకల అశోక్ కుమార్
- మల్లాడి కృష్ణారావు
- టంగుటూరు మారుతీ ప్రసాద్
- మన్నే జీవన్రెడ్డి
- డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి
- జూపల్లి రామేశ్వరరావు
- ఎన్.శ్రీనివాసన్
- రాజేష్ శర్మ
- బోరా సౌరభ్
- మూరంశెట్టి రాములు
- కల్వకుర్తి విద్యాసాగర్
- ఏపీ నందకుమార్
- పచ్చిపాల సనత్కుమార్
- వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
- డాక్టర్ కేతన్ దేశాయి
- బూదాటి లక్ష్మీనారాయణ
- మిలింద్ కేశవ్ నర్వేకర్
- ఎంఎన్ శశిధర్
- అల్లూరి మల్లేశ్వరి
- డాక్టర్ ఎస్.శంకర్
- ఎస్ఆర్ విశ్వనాథ్రెడ్డి
- బుర్రా మధుసూదన్యాదవ్
- కిలివేటి సంజీవయ్య
- కాటసాని రాంభూపాల్రెడ్డి
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ