సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన గురువారం ప్రగతి భవన్ లో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 24, శుక్రవారం ఉదయం 11 గంటలకు శాసనసభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం అదేరోజున బీఏసీ సమావేశం నిర్వహించి సభను ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయంతో పాటుగా సమావేశాల పూర్తి ఎజెండాను ఖరారు చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ