ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా రోజువారీగా పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిన ఎన్ఏబీఎల్ ప్రైవేట్ ల్యాబ్స్ లలో కూడా కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ల్యాబ్స్ లో ఆర్టీపీసీఆర్ కరోనా పరీక్షలకు చెల్లించే ధరలను మరోసారి తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పరీక్షల ధరలు తగ్గింపుపై మంగళవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం పంపిన శాంపిల్స్ ను టెస్ట్ చేసేందుకు ధరలను రూ.800 నుంచి రూ.475 కు తగ్గిస్తూ ఆదేశాలు ఇచ్చారు. అలాగే నేరుగా ఎన్ఏబీఎల్ ల్యాబ్స్ కు పరీక్షల కోసం వచ్చే వారి నుంచి గతంలో రూ.1000 రూపాయల వరకు వసూలు చేస్తుండగా, ప్రస్తుతం రూ.499 మాత్రమే వసూలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరోనా పరీక్షల కిట్లు మార్కెట్ లోకి పెద్ద ఎత్తున అందుబాటులోకి రావటంతోనే ధరలు తగ్గించాలని నిర్ణయించినట్టుగా ప్రభుత్వం వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ