కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 20 నుండి 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా 10వ తరగతి విద్యార్థుల విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి 31 వరకు పదో తరగతి విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఒక ప్రకటన చేశారు. అయితే షెడ్యూల్ ప్రకారమే జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షలు యథాతథంగా జరుగుతాయని మంత్రి పేర్కొన్నారు.
సిలబస్ పూర్తయిన నేపథ్యంలో విద్యార్థులకు మే 1 నుంచి 31 వరకు వేసవి సెలవులు ఇస్తున్నామని, ఏప్రిల్ 30 పదో తరగతి విద్యార్థులకు మరియు జూనియర్ కళాశాలలకు చివరి వర్కింగ్ డే అని చెప్పారు. సెలవుల్లో విద్యార్థులు ఇంటివద్దనే పరీక్షలకు మంచిగా సిద్ధం కావాలని సూచించారు. మరోవైపు జూన్ 7 నుంచి పరీక్షల నిర్వహణ ఉండడంతో జూన్ 1 నుంచి ఉపాధ్యాయులు పాఠశాలలకు వచ్చి పరీక్షలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధం కావాలని చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమీక్షించిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ