సీపీఎస్ రద్దు కోరుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల (యూటీఎఫ్) ఆధ్వర్యంలో సోమవారం ‘చలో విజయవాడ’ కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు విజయవాడలో 144 సెక్షన్ విధించారు. దీంతో పాటు పోలీస్ యాక్ట్ 30 అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులను భారీగా మోహరించి ఉద్యోగులు నగరంలోకి వెళ్లకుండా ప్రధాన రహదారుల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఉద్యోగ సంఘాల నేతలను అడ్డుకోవడానికి రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లలో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. కాగా ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి అనుమతి లేదని, ఉద్యోగులెవరూ దీనిలో పాల్గొనటం కోసం విజయవాడకు రావొద్దని విజయవాడ సీపీ హెచ్చరించారు. ఎవరైనా నిబంధలను అతిక్రమిస్తే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని జిల్లాల పరిధిలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ