ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. విజయవాడ నగరంలోని బీఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, పార్క్ అభివృద్ది చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విగ్రహం ఏర్పాటు, పార్క్ అభివృద్ది మాస్టర్ ప్లాన్ పై అధికారులు రెండు నమూనాలును ప్రజెంటేషన్ ద్వారా సీఎంకు వివరించారు. గ్యాలరీ, ఆడిటోరియంపై కూడా ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే పనులు ప్రారంభమైన 14 నెలల్లోనే పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు.
అనంతరం సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, అంబేద్కర్ విగ్రహం కళ తగ్గకుండా, ఎక్కువకాలం నాణ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే అక్కడ లైబ్రరీ, మ్యూజియం, గ్యాలరీ కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎస్ నీలం సాహ్ని, రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి, పలువురు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ