ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (ఫిబ్రవరి 8, మంగళవారం) ‘జగనన్న చేదోడు’ పథకం కింద రెండో ఏడాది నగదును లబ్ధిదారుల ఖాతాలో జమచేయనున్నారు. రాష్ట్రంలో సొంతంగా దుకాణాలున్న నాయీ బ్రహ్మణులకు, రజకులకు, టైలర్లకు రూ.10వేల ఆర్థిక సాయం అందించేలా “జగనన్న చేదోడు’ పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా ప్రతీ ఏడాది రూ.10వేల చొప్పున ఐదేళ్లపాటు వారికి ఆర్థిక సాయం అందించనున్నారు.
ఈ నేపథ్యంలో రెండో ఏడాదిలో భాగంగా రేపు క్యాంపు కార్యాలయం నుంచి 2.85 లక్షల మంది నాయీ బ్రహ్మణలు, రజకులు, టైలర్లకుకు రూ.285 కోట్లను విడుదల చేసి, ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ అయ్యే పక్రియను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. రెండో విడతలో ఇచ్చే రూ.285 కోట్లతో కలిపి జగనన్న చేదోడు పథకం కింద ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.583 కోట్లు విడుదల చేసినట్లు అవుతుంది. మరోవైపు పార్టీలు, రాజకీయాలకు అతీతంగా గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా పారదర్శక పద్ధతిలో ప్రభుత్వం ఈ పథకం కోసం లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ