కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పలు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి సరిహద్దు చెక్పోస్టుల వద్దనే కోవిడ్-19 (కరోనా వైరస్) పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మే 31, ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల వద్ద పరీక్షలకు సమయం పట్టే అవకాశం ఉన్నందున ప్రయాణికులు అధికారులకు సహకరించాలని కోరారు.
ప్రయాణికులకు కరోనా టెస్టుల అనంతరం పాజిటివ్ వస్తే కోవిడ్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తామని, నెగటివ్ వస్తే 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ నిబంధన పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు లాక్డౌన్ 5.0 కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలు, విధివిధానాలనే యధాతధంగా రాష్ట్రంలో కూడా అమలు చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu