భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి తీవ్రత మరింతగా పెరుగుతుంది. దీంతో దేశంలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 8392 కరోనా పాజిటివ్ కేసులు, 230 కరోనా మరణాలు నమోదయ్యాయి. గతకొన్ని రోజులుగా దేశంలో రోజు 8వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జూన్ 1, సోమవారం ఉదయానికి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,90,535 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లోఫ్రాన్స్, జర్మనీలను దాటేసి భారత్ 7 వ స్థానంలో నిలిచింది. మరోవైపు కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 5394 కి చేరింది. దేశంలో మొత్తం కరోనా బాధితుల్లో 91,819 మంది పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 93,322 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu