ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీ అంశంపై ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులకు జరిపేందుకు కమిటీ ఏర్పాటు చేశారు. ముగ్గురు మంత్రులు, సీఎస్, సలహాదారుతో కూడిన 5 గురితో ఈ కమిటీ ఉండనుంది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, సీఎస్ సమీర్ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. పీఆర్సీపై ఉద్యోగులు అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో వారితో చర్చించి పూర్తి పరిస్థితులను వివరించే దిశగా ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF