ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ గా(ఎస్ఈసీ) మాజీ సీఎస్ నీలం సాహ్ని నియామకానికి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య సలహాదారు పదవికి నీలం సాహ్ని రాజీనామా చేశారు. అనంతరం ఆమె రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.
ముందుగా ఏపీ సీఎస్ గా పదవీవిరమణ పొందిన అనంతరం నీలం సాహ్ని సీఎం వైఎస్ జగన్ కు ముఖ్య సలహాదారుగా నియమించబడ్డారు. అయితే ఎస్ఈసీగా నియామకం కావడంతో, ఆ బాధ్యతలు స్వీకరించే ముందు ముఖ్య సలహాదారు పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని గవర్నర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ముఖ్య సలహాదారు పదవికి ఆమె రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుత ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం మార్చి 31వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత నీలం సాహ్ని నూతన ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ