ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యకారులకు రూ.10 వేల ఆర్ధిక సాయాన్నిఅందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించడం, సముద్రంలో చేపల వేటను నిషేదించడంతో ఈ సంవత్సరం మత్స్యకారులు 3 నెలల పాటు ఉపాధి కోల్పోయినా నేపథ్యంలో వారిని అందుకోవాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,09,231 మంది మత్స్యకారులకు వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద ఈ రోజు (మే 6, బుధవారం) రూ.10 వేలు ఆర్ధిక సాయం అందించనున్నారు.
10 వేల రూపాయల నగదును నేరుగా లబ్ధిదారుల యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ చేయనునట్టు ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా మత్స్యకారుల వేట విరామ సాయాన్ని రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకోనున్నారు. గత సంవత్సరం కూడా ప్రపంచ మత్స్యకార దినోత్సవం రోజున 1,02,380 మంది మత్స్యకారులకు ప్రభుత్వం ఆర్ధిక సాయాన్ని అందించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu