భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్రత రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 2958 కరోనా పాజిటివ్ కేసులు, 126 కరోనా మరణాలు నమోదయ్యాయి. గత నాలుగు రోజులుగా ప్రతి రోజు రెండువేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మే 6, బుధవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 49,391 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,694 కి చేరింది. మరోవైపు కరోనా బాధితుల్లో 14,183 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 33,514 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువుగా ఉంది. మహారాష్ట్రలో ఇప్పటికే 15,525 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 2819 మంది కోలుకోగా, 617 మంది మరణించారు. దేశంలో కరోనా మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. మహారాష్ట్ర తర్వాత గుజరాత్ లో అత్యధికంగా 6,245, ఢిల్లీలో 5,104 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో 1000 కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలు:
- మహారాష్ట్ర – 15,525
- గుజరాత్ – 6,245
- ఢిల్లీ – 5,104
- తమిళనాడు – 4,058
- రాజస్థాన్ – 3,193
- మధ్యప్రదేశ్ – 3,049
- ఉత్తర ప్రదేశ్ – 2,880
- ఆంధ్రప్రదేశ్ – 1,777
- పంజాబ్ – 1,451
- పశ్చిమబెంగాల్ – 1,344
- తెలంగాణ – 1,096
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu