ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగ నియామకాలకు సంబంధించి స్థానికులకు 75శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమని, ప్రభుత్వ నిర్ణయానికి ఉన్న చట్టబద్ధతపై న్యాయవాది సీహెచ్.వరలక్ష్మి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించి, ఈ అంశంపై నెల రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
విచారణ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాది సుమంత్ రెడ్డి వాదిస్తూ, ఈ అంశంపై పారిశ్రామికవేత్తలు ఎవరైనా పిటిషన్ దాఖలు చేసుకోవచ్చుగాని, న్యాయవాదులు, ఇతరులకు ఇలాంటి అవకాశంలేదని చెప్పారు. కాగా ఈ పిటిషన్ లో ప్రజాప్రయోజనం కూడా ఉందని హైకోర్టు అభిప్రాయపడి విచారణకు స్వీకరించింది. ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వ న్యాయవాది సమయం కోరడంతో నెల రోజులు గడువు ఇస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu