ఆంధప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ పంపిణీ కోసం అందుబాటులోకి తెచ్చిన వాహనాల రంగులు మార్చాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఇచ్చిన ఆదేశాలను సోమవారం నాడు హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు మార్చి 15 వ తేదీ వరకు అమలులో ఉంటాయని కోర్టు వెల్లడించింది. అలాగే ఈ అంశంపై తదుపరి విచారణను మార్చి 15 వ తేదీన చేపట్టనున్నట్టు కోర్టు పేర్కొంది.
ముందుగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రేషన్ వాహనాల రంగులు మార్చాలని ఫిబ్రవరి 6 న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. వాహనాలపై వైసీపీ రంగులు ఉన్నాయని, రంగులు మార్చేవరకు గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ పంపిణీ నిలిపివేయాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రేషన్ డోర్ డెలివరీ వాహనాల రంగులు మార్చడం సాధ్యం కాదని, అలాగే అందుకు రెండు నెలల సమయం, భారీగా ఖర్చు అవుతుందని కోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలోనే ఇరువర్గాల వాదన అనంతరం ఎస్ఈసీ ఆదేశాలను హైకోర్టు సస్పెండ్ చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ