నాగోబా ఆలయాన్ని దర్శించుకున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ

Adilabad, Bandaru Dattatreya, Bandaru Dattatreya Visits Nagoba Temple, Bandaru Dattatreya Visits Nagoba Temple at Adilabad, Governor Bandaru Dattatreya Visits Nagoba Temple, Himachal Pradesh, Himachal Pradesh Governor, Himachal Pradesh Governor Bandaru Dattatreya, Mango News, Nagoba Temple

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవేలి మండల కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగోబా ఆలయాన్ని సోమవారం నాడు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌ దర్శించుకున్నారు. ముందుగా నాగోబా ఆలయ సందర్శనకు వచ్చిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ఎంపీ సోయం బాపురావు, అధికారులు, పలువురు బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు.

అనంతరం గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌, మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి నాగోబాను దర్శించుకొని, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. సంప్రదాయం ప్రకారం మెస్రం వంశీయులు వారిని ఘనంగా సన్మానించారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, ప్రజలంతా క్షేమంగా ఉండాలని నాగోబాకు మొక్కుకున్నట్లు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సదుపాయాలను మెరుగుపర్చడంతో పాటుగా, గిరిజనుల సాధికారత కోసం కృషి చేయాలని చెప్పారు. గవర్నర్ దత్తాత్రేయ పర్యటనలో కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, ఐటీడీఏ పీవో బవేష్‌ మిశ్రా కూడా పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =