ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను జూలై 23, శుక్రవారం సాయంత్రం విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలను results.bie.ap.gov.in, examresults.ap.ac.in, bie.ap.gov.in, results.apcfss.in వెబ్సైట్లలో అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఫలితాలకు సంబంధించి విధి విధానాలను రూపకల్పన కోసం హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల విడుదలపై అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ