ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు నేడు (జూన్ 22, బుధవారం) మధ్యాహ్నం 12.30 గంటలకు విడుదల కానున్నాయి. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర జనరల్, ఒకేషనల్ కోర్సుల పరీక్షా ఫలితాలను విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఏపీ ఇంటర్ బోర్డు చైర్మన్ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ముందుగా ఏపీలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు-2022లో భాగంగా మే 6 నుంచి మే 23 వరకు ప్రథమ సంవత్సరం పరీక్షలు, మే 7 నుంచి మే 24 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అనంతరం ఇంటర్ బోర్డు అధికారులు వాల్యుయేషన్ ప్రక్రియను వేగంగా పూర్తీ చేశారు. దీంతో నేడు మధ్యాహ్నం 12.30 గంటలకు ఫలితాల విడుదలకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇంటర్ ఫలితాలను www.bie.ap.gov.in, www.examresults.ap.nic.in వెబ్ సైట్లలో అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY