ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మరో జాతీయస్థాయి పురస్కారం దక్కించుకుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో గుర్తింపుగా ఏపీ పోలీస్ శాఖ ఈ అవార్డును అందుకుంది. ఇంటెరోపెరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్) ను అత్యుత్తమంగా అమలు చేసి, దేశంలో రెండో స్థానాన్ని దక్కించుకుని కేంద్రప్రభుత్వం చేత అవార్డు పొందింది. రూల్ ఆఫ్ లా ఏర్పాటు చేయడంలో ఐసీజేఎస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ విధానం ద్వారా పారదర్శకత, జవాబుదారీతనం మరియు వేగవంతంగా న్యాయం జరగుతుంది. ఐసీజేఎస్ ప్రాజెక్టుకు సంబంధించిన అవార్డులను ఈ రోజు కేంద్రప్రభుత్వం వర్చువల్ గా నిర్వహించిన సమావేశంలో అందజేసింది. కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నుంచి ఈ అవార్డును ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అందుకున్నారు. ఏపీ పోలీస్ శాఖ జాతీయస్థాయి పురస్కారం అందుకోవడం పట్ల రాష్ట్ర పోలీసులు చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత అభినందించారు.
ICJS plays an important role in establishing Rule of Law. It has ushered in era of transparency, accountability and speedy justice. Hon’ble CM of AP and HM appreciated the outstanding work being done by AP Police on this front. (2/2)@ANI @timesofindia @TV9Telugu @sakshinews pic.twitter.com/exUu3IcUR0
— Andhra Pradesh Police (@APPOLICE100) December 15, 2020
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ