నేడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు నివాళులు అర్పించారు. ఆధునిక భారతదేశ నిర్మాణంలో వాజ్పేయి కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆధునిక భారతదేశ నిర్మాణంలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించిన ప్రముఖులలో ఒకరు అని టీడీపీ నాయకుడు ట్విట్టర్లో నివాళులర్పించారు. ప్రధానమంత్రిగా తన అత్యుత్తమ విధానాలతో దేశ గమనాన్ని మార్చిన నాయకుడు వాజ్పేయి వర్ధంతి సందర్భంగా వారికి నేను నివాళులు అర్పిస్తున్నానని చంద్రబాబు తెలిపారు.
అలాగే, టెలికాం వంటి కీలక సంస్కరణలపై వాజ్పేయితో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని చంద్రబాబు అన్నారు. స్వర్ణ చతుర్భుజం ప్రాజెక్టు, ఓపెన్ స్కై పాలసీ, మైక్రో ఇరిగేషన్, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టులు.. దేశంలోని అభివృద్ధి చెందిన రోడ్లలో సగం వాజ్పేయి హయాంలోనే అభివృద్ధి చెందాయని, పోఖ్రాన్ అణుపరీక్షలు, కార్గిల్ విజయం అప్పట్లోనే జరిగాయని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశ శక్తిని ప్రపంచానికి చాటిచెప్పారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా వాజ్పేయి దేశభక్తుడు, ఆయనను తప్పక గుర్తుంచుకోవాలని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY