ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం నాడు కీలక ప్రకటన చేశారు. 2022 లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీచేయనున్నట్లు ప్రకటించారు. యూపీ అభివృద్ధిని అవినీతి నాయకులు అడ్డుకుంటున్నారని విమర్శించారు. అవినీతి విషయంలో ఇప్పటికి అన్ని యూపీ ప్రభుత్వాలు ఒకదాన్ని మరొకటి మించిపోయాయని, అన్ని పార్టీలు కూడా ఎంచుకున్న ప్రజలకు ద్రోహం చేశాయని అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. యూపీని పాలించిన చాలా రాజకీయ పార్టీలు ప్రజల గురించి కాకుండా, తమ ఇళ్లు నింపుకోడానికే పనిచేశాయని వ్యాఖ్యానించారు. మంచి పరిపాలన కోసం ఆప్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని యూపీ ఓటర్లను అరవింద్ కేజ్రీవాల్ కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ