ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంగళవారం ఉదయం 11.30 గంటలకు విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల షెడ్యూల్, సింగిల్ బెంచ్ ఉత్తర్వులు, డివిజన్ బెంచ్కు అప్పీల్పై గవర్నర్కు వివరించినట్టు తెలుస్తుంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను సస్పెండ్ చేస్తూ సింగిల్ జడ్జి ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారమే డివిజన్ బెంచ్ ముందు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ హౌస్ మోషన్ పిటిషన్పై అత్యవసరంగా విచారణ జరపాలని ఎస్ఈసీ తరఫు న్యాయవాది అభ్యర్థించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం మంగళవారం నాడు విచారణ జరుపుతామని పేర్కొంది. ఈ క్రమంలోనే ఈ రోజు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలిశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ