ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ గా నియమితలైన బిశ్వభూషణ్ హరిచంద్రన్ తో వైసీపీ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి భేటీ అయ్యారు. భువనేశ్వర్ లోని ఆయన నివాసానికి వెళ్లి ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర పరిస్థితులు వివరించి, ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరుపున శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా బిశ్వభూషణ్ ను శాలువాతో సత్కరించి, వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని అందజేశారు. కాగా ఈ నెల 24 న బిశ్వభూషణ్ హరిచందన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
బిశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల 23 న ఆంధ్రప్రదేశ్ కి రానున్నారు, కుటుంబ సభ్యులతో కలిసి మొదట తిరుపతికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం గన్నవరం చేరుకొని అక్కడ పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు, తరువాత గన్నవరం నుంచి రోడ్డుమార్గంలో విజయవాడ చేరుకొని కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుంటారు. ఆలయ సందర్శన అనంతరం రాజ్ భవన్ చేరుకుంటారు, 24 వ తేదీ ఉదయం 11:30 గంటలకు రాష్ట్ర గవర్నర్ గా ప్రమాణం చేస్తారు.
[subscribe]
[youtube_video videoid=Mfp0sA6os48]