ఏపీ టీడీపీ అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు అయింది. సోంపేట అదనపు జిల్లా కోర్టు 50 వేల రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది. ముందుగా నిమ్మాడలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలో అచ్చెన్నాయుడు సహా మొత్తం 22 మందిపై కోటబొమ్మాలి పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయింది. అనంతరం అచ్చెన్నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకుని కోటబొమ్మాలి సెషన్స్ కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ తర్వాత అచ్చెన్నాయుడుకు 14 రోజుల పాటుగా ఫిబ్రవరి 15 వరకు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను అంపోలులో ఉన్న జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు తరపు న్యాయవాది సోంపేట కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, విచారణ అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ