ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అస్వస్థతకు గురవడంతో బుధవారం ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో గవర్నర్ చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆరోగ్యంపై ఏఐజీ హాస్పిటల్స్ తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఏఐజీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. వైద్యుల బృందం ఆయన్ను పర్యవేక్షిస్తుందని, సాధారణ ఆక్సిజన్ సంతృప్తతతో ఆయన ఆరోగ్య పరిస్థితి వైద్యపరంగా స్థిరంగా ఉందని వెల్లడించారు.
కాగా గవర్నర్ గత వారం న్యూఢిల్లీ పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, దగ్గు మరియు జలుబుతో ఇబ్బంది పడుతుండడంతో ముందు జాగ్రత్తగా ఆర్టీ-పీసీఆర్ పరీక్ష నిర్వహించగా, నవంబర్ 15న గవర్నర్కు కోవిడ్-19 ఉన్నట్లు నిర్ధారణ అయిందని ప్రెస్ సెక్రటరీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు గవర్నర్ ఆరోగ్యంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏఐజీ వైద్యులతో ఫోన్లో మాట్లాడి ఆరా తీశారు. ప్రస్తుతం గవర్నర్ కు అందిస్తున్న వైద్యం వివరాలు, పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ