ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)కు జాతీయ స్థాయి అవార్డు దక్కింది. సంస్కరణల్లో భాగంగా పలు వినూత్న విధానాలను అమలు చేస్తున్నందుకు గానూ కేంద్రప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక ‘స్కోచ్’ అవార్డు లభించింది. ఇటీవలి కాలంలో ప్రయాణికుల సౌకర్యార్ధం ఏపీఎస్ఆర్టీసీ సంస్థాగతంగా అనేక విప్లవాత్మక మార్పులను తీసుకొస్తోంది. వీటిలో నగదు రహిత లావాదేవీలు, పేపర్లెస్ టికెట్ల జారీ వంటివి బాగా పాపులర్ అయ్యాయి. ఈ రెండు విధానాలు కేంద్రం దృష్టిని కూడా ఆకర్షించాయి. ఈ నిర్ణయాలు ఇటు సంస్థతో పాటు, అటు ప్రయాణికులకు కూడా మేలు జరిగే విధంగా ఉన్నాయని కేంద్రం అభిప్రాయపడింది. దీంతో దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ సంస్థలతో పోటీపడి మరీ 2022 ఏడాదికి గాను స్కోచ్ అవార్డును గెలుచుకుంది. కాగా శుక్రవారం జరిగిన వర్చువల్ సెమినార్ ద్వారా ఈ జాతీయ అవార్డును ఏపీఎస్ఆర్టీసీ ఈడీ బ్రహ్మానంద రెడ్డి అందుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY