అధికార టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని ఫిరాయించించేలా ప్రలోభాలకు గురిచేస్తూ కొనుగోలు వ్యవహారం నడవడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా ఈ వ్యవహారం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన పామ్ హౌజ్ లో వెలుగులోకి రావడంతో పాటుగా ఆయన కూడా నలుగురు ఎమ్మెల్యేలలో ఒకరిగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భద్రతను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రోహిత్ రెడ్డికి 4+4 గన్మెన్లను కేటాయించారు. ప్రస్తుతం రోహిత్ రెడ్డికి 2+2 గన్మెన్ భద్రత ఉండగా, తాజాగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో భద్రతను 4+4 గన్మెన్లకి పెంచారు. అలాగే ఆయన ఇంటివద్ద పికెట్ ఏర్పాటు చేయడంతో పాటుగా, ఆయనకు బుల్లెట్ ఫ్రూప్ వాహనాన్ని కూడా కేటాయించారు. ఇవన్నీ ఈ రోజు నుండే అమల్లోకి రానున్నట్టు రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE