కడప జిల్లాలో శనివారం ఉదయం ఘోరప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కలసపాడు మండలం మామిళ్లపల్లె గ్రామ శివారులో వాహనంలోని జిలెటిన్ స్టిక్స్ పేలిన ఘటనలో 9 మంది మరణించారు. ఈ ఘటనలో పలువురికి గాయాలవగా సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బద్వేలు నుంచి ముగ్గురాళ్ల గనుల్లో బ్లాస్టింగ్ కోసం వాహనంలో జిలెటిన్ స్టిక్స్ తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకునట్టు సమాచారం. జిలెటిన్ స్టిక్స్ పేలుడు తీవ్రతతో మృతదేహాలు గుర్తుపట్టనంతగా మారినట్టు తెలుస్తుంది . వాహనం సైతం పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. మృతులు పులివెందులకు చెందినవారిగా ప్రాథమిక విచారణలో గుర్తించారు. మరోవైపు గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ