కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య(62) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పోందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. నియోజకవర్గ ప్రజల సందర్శనార్థం వెంకట సుబ్బయ్య పార్థివదేహాన్ని బద్వేల్ మార్కెట్ యార్డ్లో ఉంచారు. సోమవారం ఉదయం కడపలో ప్రభుత్వ లాంఛనాలతో వెంటక సుబ్బయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బద్వేల్ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరపున ఆయన తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం వైఎస్ జగన్ కడపకు వెళ్లి, ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు. వెంకట సుబ్బయ్య మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు, పలువురు వైఎస్సార్సీపీ నేతలు సంతాపం తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ