తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 535 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మార్చి 27, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,06,339 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి మరో 278 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 3,00,156 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 97.98 శాతంగా ఉంది.
ఇక కరోనా వలన రాష్ట్రంలో మరో ముగ్గురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1688 కి పెరిగింది. కాగా మరణాల రేటు 0.55 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,495 యాక్టీవ్ కేసులు ఉండగా, ఇందులో 1,979 మంది హోం/ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 154, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలో 49, రంగారెడ్డి జిల్లాలో 39, నిజామాబాదులో 32, సంగారెడ్డిలో 22, మహబూబ్ నగర్ లో 21, యాదాద్రి భువనగిరిలో 19, ఖమ్మంలో 16, కరీంనగర్ లో 15, జగిత్యాలలో 15, వరంగల్ అర్బన్ లో 11, నల్గొండలో 11, నిర్మల్ లో 11, ఆదిలాబాద్ లో 11 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ