భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఇటీవలే జాతీయ నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కార్యవర్గంలో తెలంగాణకు చెందిన నేత డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలిగా, ఆంధ్రప్రదేశ్ కు చెందిన నేత పురందేశ్వరిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. కాగా ఇటీవల జాతీయ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులుగా నియమించబడ్డ పలువురు నేతలను పలు రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ లుగా నియమిస్తున్నట్టు శుక్రవారం నాడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. అందులో భాగంగా ఒడిశా రాష్ట్ర ఇన్ఛార్జ్గా పురందేశ్వరిని నియమించారు. అలాగే కర్ణాటక సహ ఇన్ఛార్జ్గా డీకే అరుణను నియమించారు. మరోవైపు ఏపీ బీజేపీకి ఇన్ఛార్జిగా మురళీధరన్, సహ ఇన్ఛార్జిగా సునీల్ దేవధర్ కొనసాగనున్నారు. ఇక తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జిగా తరుణ్ చుగాకు బాధ్యతలు అప్పగిస్తునట్టు వెల్లడించారు.
भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने विभिन्न प्रदेशों के प्रभारियों एवं सह प्रभारियों की नियुक्ति की। pic.twitter.com/KjOFgD5FIF
— BJP (@BJP4India) November 13, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ