తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్న పీ.వెంకటరామిరెడ్డిని సిద్దిపేట జిల్లాకు బదిలీ చేశారు. అలాగే ఆయనకు మెదక్ జిల్లా బాధ్యతలను కూడా అదనంగా అప్పగించారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్గా ఉన్న భారతి హోళికేరిని మంచిర్యాల జిల్లాకు బదిలీ చేశారు. అలాగే ఆమెకు పెద్దపల్లి జిల్లా బాధ్యతలను కూడా అప్పగించారు. మేడ్చల్-మల్కాజ్ గిరి కలెక్టర్గా ఉన్న వీ.వెంకటేశ్వర్లును ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా బాధ్యతలను ప్రభుత్వం హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మొహంతీకి అప్పగించింది. ఇక ప్రస్తుతం మెదక్ కలెక్టర్గా ఉన్న ఎం.హనుమంతరావును సంగారెడ్డి జిల్లాకు బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ