వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రారంభంపై సీఎం కేసీఆర్ సమీక్ష

CM KCR, CM KCR Review Meeting, dharani portal, dharani portal news, Dharani Portal Updates, KCR Over Dharani Portal, KCR Over Registration of Non-agricultural Lands in Dharani Portal, Mango News Telugu, Registration of Non-agricultural Lands, Registration of Non-agricultural Lands in Dharani Portal’, Telangana CM KCR, Telangana Dharani Portal

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ విధానంలో భాగంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లో ఇప్పటికే వ్య‌వ‌సాయ భూముల రిజిస్ట్రేష‌న్లు మరియు మ్యుటేష‌న్లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా వీలైనంత త్వరలో ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి ప్రారంభించాలి? వీలైనంత త్వరగా ప్రారంభించడానికి ఏం చేయాలి? అనే విషయాలు చర్చించడానికి సీఎం కేసీఆర్ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొననున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =