మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురి అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అయితే తాజాగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ కీలక ప్రకటన చేసింది. ఈ కేసుకు సంబంధించి నమ్మకమైన సమాచారం అందించిన వారికీ రూ.5లక్షలు బహుమానంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఏదైనా సమాచారం అందించిన వ్యక్తి లేదా వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని సీబీఐ పేర్కొంది. ఎవరి వద్దనైనా ఈ హత్యకేసుకు సంబంధించిన ఖచ్చితమైన, నమ్మదగిన సమాచారం ఉన్నట్లయితే పరిశోధనా అధికారి డీఎస్పీ దీపక్ గౌర్, పర్యవేక్షణ అధికారి అయిన ఎస్పీ రామ్ సింగ్ లకు ఫోన్ చేసి కానీ, లేదా కార్యాలయంలో కానీ సంప్రదించి వివరాలు అందించవచ్చని సీబీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ