ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా.సమీర్ శర్మ పదవీ కాలం మరో ఆరు నెలలు పాటు పొడిగించబడింది. నవంబర్ 30, 2022 వరకు సీఎస్ సమీర్ శర్మ పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం నాడు కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ముందుగా సీఎస్ సమీర్శర్మ పదవీ కాలం నవంబర్ 30, 2021తో ముగియగా, పొడిగింపుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. దాంతో సీఎస్ పదవీ కాలాన్ని ఆరు నెలల పాటుగా(మే 31, 2022) పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా రెండోసారి కూడా సీఎస్ పదవీకాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ కేంద్రం అనుమతి ఇచ్చింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF