టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ

Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Chandrababu Conducts Meeting With TDP Leaders, Chandrababu Conducts Meeting With TDP Leaders In Amaravati, Chandrababu Naidu Conducts Meeting With TDP Leaders, Chandrababu Naidu Conducts Meeting With TDP Leaders In Amaravati, Mango News Telugu, Meeting With TDP Leaders In Amaravati

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్యనేతలతో నవంబర్ 15, శుక్రవారం ఉదయం అమరావతిలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఇసుక కొరత సమస్య, ప్రభుత్వ నిర్ణయాలు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. అదేవిధంగా జిల్లాల్లోని పార్టీ పరిస్థితుల గురించి ముఖ్యనేతలను అడిగి చంద్రబాబు తెలుసుకోనున్నారు. వైసీపీ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఇంగ్లీష్ మీడియం జీవో, ప్రభుత్వ భూముల అమ్మకం, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అన్యమత ప్రచారం, సిమెంట్ ధరల పెంపు అంశాలుపై కూడ చర్చింబోతున్నట్టు సమాచారం. అదేవిధంగా ఇటీవలే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్‌బై చెప్పడం, తరువాత దేవినేని అవినాష్‌ పార్టీ మారడంతో కృష్ణాజిల్లాలో పార్టీ పరిస్థితులపై చర్చించనున్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కోంటున్న పలు సమస్యలపై భవిష్యత్ కార్యచరణను రూపొందించే అవకాశముంది. అలాగే త్వరలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలవనున్నాయి. ఈ నేపధ్యంలో చంద్రబాబు ఎంపీలతో భేటీ అయ్యి పార్లమెంట్ లో ప్రస్తావించాల్సిన అంశాలపై వారికీ దిశానిర్దేశం చేయనున్నారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 20 =