చంద్ర‌బాబు-పెమ్మ‌సాని.. ఇద్ద‌రూ.. ఇద్ద‌రే!

Pemmasani Chandrasekhar, Chandrababu Naidu, telugudesam party, AP Elections, YSRCP,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics,AP Political updates,andhra pradesh,AP,Political updates,Mango News Telugu,Mango News
Pemmasani chandrasekhar, chandrababu naidu, telugudesam party, ap elections

అవును.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు – గుంటూరు లోక్‌స‌భ అభ్య‌ర్థి డాక్ట‌ర్ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌.. ఇద్ద‌రూ ఇద్ద‌రే. ఒక విజ‌న్ ఉన్న నాయ‌కులే. ఉన్న‌త‌స్థాయి కుటుంబంలో పుట్టినా.. అత్యున్న‌త‌స్థాయికి ఎదిగినా.. త‌మ మూలాల‌ను ఎప్పుడూ మ‌ర‌చిపోవ‌డం లేదు. ప్ర‌జాసేవ చేయడానికి ఏ కొల‌మానాలూ పెట్టుకోవ‌డం లేదు. వారికున్న‌దల్లా ఒక‌టే విజ‌న్‌. యువ‌త‌కు ఉద్యోగాలు సృష్టించ‌డం.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ముందంజ‌లో ఉంచ‌డం.. బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల అభ్యున్న‌తికి కృషి చేయ‌డం.

ఒక‌రు టెక్నాల‌జీని ఉమ్మ‌డి ఆంధ‌ప్ర‌దేశ్‌ రాష్ట్రానికి తీసుకొస్తే.. మ‌రొక‌రు ఆ టెక్నాల‌జీ స‌హాయంతో ఎదిగి విదేశాల్లో సైతం తెలుగువాడి జెండా ఎగుర‌వేసిన వారు. నారా చంద్ర‌బాబునాయుడు, డాక్ట‌ర్ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ ఇద్ద‌రిదీ క‌ష్ట‌ప‌డే త‌త్వం. మాట ఇచ్చారంటే.. దాన్ని నెర‌వేర్చేందుకు ఎందాకైనా వెళ్తారు.. ఎవ‌రితోనైనా కొట్లాడ‌తారు. అభివృద్ధి, సేవ కార్య‌క్ర‌మాల్లోనే కాదు.. ప్ర‌తిప‌క్షాల‌ను ఢీకొట్ట‌డంలోనూ డాక్ట‌ర్ పెమ్మ‌సాని చంద్రశేఖ‌ర్‌.. త‌మ అధినేత నారా చంద్ర‌బాబునాయుడిని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వంతో చంద్ర‌బాబునాయుడు రాష్ట్రంలో వైసీపీని ఢీకొడుతుంటే.. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టిన 4 నెల‌ల‌కే.. గుంటూరు రాజ‌కీయాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌. లోక్‌స‌భ ప‌రిధిలో పెమ్మ‌సాని నిర్వ‌హిస్తున్న స‌భ‌లు, స‌మావేశాల‌న్నీ స‌క్సెస్ అవుతుండ‌డం.. త్వ‌ర‌లో జ‌రిగే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఆయ‌న విజ‌యానికి నాంది అనే ప్ర‌చారం జ‌రుగుతోంది.

మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల్లో రాష్ట్రంలో నారా చంద్ర‌బాబు నాయుడు.. గుంటూరు లోక్‌స‌భ ప‌రిధిలో పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ చ‌క్రం తిప్ప‌డం ఖాయ‌మ‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. వైసీపీ అరాచ‌క‌పాల‌న‌ను అంత‌మొందించి.. స్వ‌చ్ఛ‌మైన ప‌రిపాల‌నను మ‌ళ్లీ ప్ర‌జ‌ల‌కు అందించాల‌నే ల‌క్ష్యంతో ఆ ఇద్ద‌రు నాయ‌కుల రాజ‌కీయ అడుగులు కొన‌సాగుతున్నాయి. గుంటూరు లోక్‌స‌భ ప‌రిధి లో పెమ్మ‌సాని వేస్తున్న తొలిఅడుగుల్లోనే వైసీపీ నాయ‌కుల‌తో త‌క‌ధిమి త‌క‌ధిమి ఆడిస్తున్నారు. పాద‌యాత్ర‌ల్లో పెమ్మ‌సానికి వ‌స్తున్న ప్ర‌జాద‌ర‌ణను చూసి విప‌క్ష నాయ‌కుల శిబిరాలు క‌దులుతున్నాయి. పెమ్మ‌సానిని అడ్డుకునే వ్య‌హర‌చ‌న‌ల కోసం చ‌ర్చోప‌చ‌ర్చ‌లు నిర్వ‌హిస్తున్నాయి. ఒక‌వైపు రాష్ట్రంలో నారా చంద్ర‌బాబునాయుడుకు, తెలుగుదేశం పార్టీకి ఆద‌ర‌ణ పెరుగుతుండ‌డం, స్థానికంగా పెమ్మ‌సాని బ‌ల‌ప‌డుతుండ‌డం.. వైసీపీ నాయ‌కుల‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. కానీ.. వైసీపీ ఎన్ని వ్యూహాలు ప‌న్నినా.. ఎన్ని ఎత్తుగ‌డ‌లు వేసినా.. రాష్ట్రంలో చంద్ర‌బాబు గెలుపును, గుంటూరు లోక్‌స‌భ‌లో పెమ్మ‌సాని విజ‌యాన్ని ఎవ్వ‌డూ ఆప‌లేడ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌జ‌లారా.. మ‌రి మీరేమంటారు..?!

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + three =