ఏపీ ఈసెట్-2020 ఫలితాలు విడుదల

Andhra Pradesh ECET Results, AP ECET Results, AP ECET results 2020, AP ECET Results 2020 Manabadi, AP ECET results 2020 released, AP ECET-2020 Results, AP Latest News, AP News, apecet, apecet results

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సెప్టెంబర్ 14 వ తేదీన ఈసెట్-2020 ప్రవేశపరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు ఈసెట్‌–2020 పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఈసెట్ పరీక్షకు మొత్తం 31,891 మంది విద్యార్థులు హాజరు కాగా, 30,654 మంది ఉత్తీర్ణులయినట్టు పేర్కొన్నారు. ఈసెట్-2020 ఫలితాలను https://sche.ap.gov.in/ECET/ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కోసం డిప్లొమా, బీఎస్సి మాథెమాటిక్స్ విద్యార్దులకు ఈసెట్ పరీక్షను నిర్వహిస్తారు. ఈసెట్ ర్యాంకుల ఆధారంగా బీఈ /బీటెక్, బీఫార్మ‌సీ కోర్సుల్లో రెండవ సంవత్సరంలోకి రెగ్యులర్‌ ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు. ఈసెట్ ఫలితాల విడుదల కార్యక్రమంలో ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, విద్యా శాఖ స్పెషల్ సీఎస్ సతీష్ చంద్ర, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 19 =