ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫిబ్రవరి 19, బుధవారం నాడు పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేశారు. మార్చి 23, 2020 నుంచి ఏప్రిల్ 8, 2020 వరకు పరీక్షలు జరగనున్నాయి. అలాగే ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.
ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్:
=> మార్చి 23, 2020: ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1
=> మార్చి 24, 2020: ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2
=> మార్చి 26, 2020: సెకండ్ లాంగ్వేజ్
=> మార్చి 27, 2020: ఇంగ్లీష్ పేపర్-1
=> మార్చి 28, 2020: ఇంగ్లీష్ పేపర్-2
=> మార్చి 30, 2020: గణితం పేపర్-1
=> మార్చి 31, 2020: గణితం పేపర్-2
=> ఏప్రిల్ 01, 2020: జనరల్ సైన్స్ పేపర్-1
=> ఏప్రిల్ 03, 2020: జనరల్ సైన్స్ పేపర్-2
=> ఏప్రిల్ 04, 2020: సోషల్ స్టడీస్ పేపర్-1
=> ఏప్రిల్ 06, 2020: సోషల్ స్టడీస్ పేపర్-2
=> ఏప్రిల్ 07, 2020: సంస్కృత, అరబిక్, పర్షియన్ సబ్జెక్ట్స్
=> ఏప్రిల్ 08, 2020: ఒకేషనల్ పరీక్షలు.
[subscribe]