ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా మరో 809 చికిత్సలను చేర్చాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం వైద్య, ఆరోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్ణయయించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షకు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు సహా పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వారికి పలు కీలక సూచనలు, ఆదేశాలు ఇచ్చారు.
వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షలో సీఎం జగన్ చేసిన కొన్ని కీలక సూచనలు..
- హెల్త్ హబ్లు, ఆసుపత్రుల నిర్వహణ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లపై అధికారులకు పూర్తి అవగాహన ఉండాలి.
- విలేజ్ క్లినిక్స్ మరియు ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద కవర్ చేయబడుతున్న సేవలను తెలిపే బోర్డులు ఉంచాలి.
- ఇతర రాష్ట్రాలకు చెందినవారు మన రాష్ట్ర పరిధిలో ప్రమాదవశాత్తూ గాయపడితే వారికి వెంటనే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించాలి.
- ఉత్తమ సేవలు అందించిన ఆరోగ్య మిత్రలను ప్రభుత్వం గుర్తించి అవార్డులు ఇచ్చి సత్కరిస్తుంది.
- అర్హులైనవారికి సేవా మిత్ర, సేవా రత్న వంటి ఉన్నత ఆరోగ్య సేవ అవార్డులు ఇవ్వబడతాయి.
- వైసీపీ ప్రభుత్వం వచ్చేనాటికి 1059 వైద్య సేవలు ఉండగా, 2020 జనవరిలో మరో 1,000 కొత్త వాటిని చేర్చామని తెలిపారు.
- వేయి రూపాయల పైబడి ఖర్చు అయ్యే అన్ని చికిత్సలను ఆరోగ్యశ్రీ కిందకు చేర్చమని వెల్లడించారు.
- అనంతరం మరికొన్నిటిని పెంచుకుంటూ గతేడాది జూన్ నాటికీ 2,446కి పెంచామని, ఇప్పుడు తాజాగా పెంచినవాటితో కలిపి మొత్తం 3,255 చికిత్సలు అయ్యాయని తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY