తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం మరింతగా ముదురుతోంది. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముందుగా ప్రకటించినట్లుగానే శుక్రవారం యాదాద్రికి వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం ఆలయానికి చేరుకున్న బండి సంజయ్ తొలుత తడి బట్టలతో ఆలయంలోకి వెళ్లి, గర్భగుడి ముందు పూజారి సమక్షంలో తులసి మాల, అక్షింతలపై చేయి పెట్టి ప్రమాణం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో బిజెపికి కానీ, తనకు కానీ ప్రమేయం లేదని శ్రీ లక్ష్మీనరసింహా స్వామి సన్నిధిలో ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు బండికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి తరలిరావడంతో యాదగిరిగుట్టలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం సంజయ్ మాట్లాడుతూ.. చెప్పిన మాట ప్రకారం ఈరోజు స్వామి ఎదుట ప్రమాణం చేశానని, సీఎం కేసీఆర్కు కూడా దీనిలో ఎలాంటి ప్రమేయం లేకపోతే వచ్చి ప్రమాణం చేయాలని మరోసారి సవాల్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY